1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను 'బ్లాక్ బడ్జెట్' అని అంటారు. 1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం దేశాన్ని ఆర్థిక సంక్షోభానికి గురి చేసింది. 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. అలాగే బొగ్గు గనులు, బీమా కంపెనీల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు. దీంతో ఈ బడ్జెట్ను 'బ్లాక్ బడ్జెట్' అని పిలుస్తారు.