2020 ఆగస్ట్ 7న వందే భారత్ మిషన్ కింద దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX-1344 విమానం కోజికోడ్లో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం, తక్కువ విజిబిలిటీ కారణంగా రన్వే దాటి లోయలో పడింది. విమానం రెండు ముక్కలైపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా 21 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.