రామాయణం సుందరకాండలో సీతాన్వేషణ కోసం హనుమాన్ లంకకు బయలుదేరుతాడు. సీతను చూసిన హనుమకు రావణాసురుని సైన్యం తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న హనుమత్ జయంతి.