హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే రహదారిలో పెంపుడు శునకాన్ని ఓనర్ (మహిళ) వదిలేశారు. అనంతరం బాధతో ఆ పెంపుడు కుక్క తన యజమాని కారును 2 కిలోమీటర్ల మేర వెంబడించింది. అయితే కారు నడిపిన మహిళ ఏ మాత్రం తన పెంపుడు శునకం పట్ల కనికరం చూపలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓనర్ వ్యవహార శైలిపై తీవ్రంగా విమర్శలొస్తున్నాయి.