తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలకూ ‘గద్దర్’ అవార్డుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డును ప్రకటిస్తామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. ‘సింహా’ అవార్డుల దరఖాస్తుదారులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దు’’ అని దిల్ రాజు తెలిపారు.