టీ తాగిన వెంటనే పెరుగు, పెరుగుతో తయారు చేసిన వంటలు తినకూడదు. టీ మనకు వేడి చేస్తే.. పెరుగు చలువ చేస్తుంది. అందువల్ల జీవక్రియ అస్తవ్యస్థం అవుతుంది. అలాగే పసుపును టీతో కలిపి ఎస్సలు తీసుకోకూడదు. జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది. చాలా మంది టీతోపాటు పకోడీలు, బజ్జీలు తింటుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పెరుగుతాయి.