టీ20 ప్రపంచకప్ తో భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖారారైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం IPLలో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గా గంభీర్ వ్యవహరిస్తున్నాడు. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ గా రావడం ఖాయం కావడంతో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గా ఉండాలని రాహుల్ ద్రవిడ్ ను సంప్రదించినట్లు సమాచారం.