కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసుకొని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. డిప్రెషన్ నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు రోజూ తాగితే సమస్య తగ్గుతుంది. ఈ పానీయం శరీరాన్ని హైడ్రేట్ చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.