బస్సులో ఫుడ్ పడిందని యువకుడిని హింసించి చంపిన డ్రైవర్

68చూసినవారు
బస్సులో ఫుడ్ పడిందని యువకుడిని హింసించి చంపిన  డ్రైవర్
ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. 22 ఏళ్ల యువకుడిని బస్సు డ్రైవర్, అతని స్నేహితులు తీవ్రంగా కొట్టి కదులుతున్న బస్సులో నుంచి బయటకు పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యువకుడు వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సుల్తాన్ పూర్‌ దాబాలో వంట చేసి, తిరిగి వస్తుండగా బస్సులో ఫుడ్ పడింది. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్, అతని స్నేహితులు యువకుడిని కొట్టి రన్నింగ్ బస్ నుంచి బయటకు పడేశారు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్