జమ్మూకశ్మీర్ శ్రీనగర్లోని పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్పై పాకిస్తాన్ డ్రోన్ల దాడికి పాల్పడింది. ఈ క్రమంలో పాక్ డ్రోన్లను భారత ఆర్మీ తిప్పి కొట్టింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పది డ్రోన్లతో పాక్ దాడి చేసింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం పేల్చివేయడంతో శ్రీనగర్ ఎయిర్ పోర్టుకి ముప్పు తప్పింది. గుజరాత్లో 10, రాజస్థాన్లో 10, జైసల్మేరులో 9 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది.