గుజరా‌త్‌లో డ్రోన్ దాడులు!

80చూసినవారు
గుజరా‌త్‌లో పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. కచ్ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్అవుట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని 'ఎక్స్' వేదికగా సూచించారు. నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి కాల్పులు జరగలేదని ఏడీజీ తెలిపారు. డ్రోన్లు కొన్ని వచ్చాయి.. వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్