వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి కరువుల తీవ్రత అధికమవుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనం ప్రకారం.. గత 40 ఏళ్లలో కరువు ప్రభావం 40% పెరిగింది. వాతావరణం వేడెక్కడం వల్ల AED (Evaporative Demand) పెరిగి, నేల తేమ కోల్పోయి పంటలు ఎండిపోతున్నాయి. 2022లో భూమి 30% కరువుకు గురవగా, దానికి 40% AEDనే కారణమని శాస్త్రవేత్త క్రిస్ ఫాంక్ తెలిపారు.