వీఐపీలే టార్గెట్గా హైదరాబాద్లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు, పలువురిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ గ్యాంగ్కు చెందిన కీలక సూత్రధారి ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు.