ఢీల్లీలో శనివారం సాయంత్రం దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 20 నిమిషాల పాటు భయంకరంగా గాలి వీచింది. ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ రావడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలుల వలన భారీగా చెట్లు విరిగిపడడం తో పాటు, భారీ హోర్డింగులు నేలకొరిగాయి. ప్రస్తుతం దుమ్ము తుఫాన్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.