పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు

65చూసినవారు
పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరానికి సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 4.0గా భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్