యమునా నది నీటిలో అమ్మోనియం శాతం ఎక్కువగా ఉందని, ఇదే నీటిని ఢిల్లీకి హర్యానా సరఫరా చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ సీఎం ఆతిషి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్లు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. ఆప్ ఆరోపణలపై స్పందించిన ఈసీఐ హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలలోగా యమునా నీటి నాణ్యతకు సంబంధించిన రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.