జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రఘునాథపల్లికి చెందిన రైతు బొమ్మినేని రాంచంద్రారెడ్డి (60) న్యాయం కోసం సైకిల్పై సుప్రీంకోర్టుకు బయలుదేరాడు. తన భార్య గత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీలో దిగగా ప్రత్యర్థులు తనను కిడ్నాప్ చేసి నామినేషన్ను విత్ డ్రా చేయించారని రాంచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టు, మానవ హక్కుల సంఘాల్ని ఆశ్రయించినా స్పందన దక్కలేదన్నారు. దీంతో సుప్రీంకోర్టుకు సైకిల్పై బయలుదేరారు.