ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల కొనసాగుతున్నాయి. కాల్పుల ఘటనపై ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.