ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

68చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న కిలాం - భార్గం అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. మృతి చెందిన వారు ఈస్ట్ బస్తర్ డివిజన్ కు చెందిన డీవీసీఎం సభ్యుడు హల్దర్, ఎసీఎం రామేగా పోలీసులు గుర్తించారు. వారినుండి AK-47 రైఫిల్ తో పాటు పలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్