ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28), కరుణ్ నాయర్(26) పరుగులతో పర్వాలేదనిపించారు. కేఎల్ రాహులు(55) హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (24), పంత్(41) ఉన్నారు. కాగా ఇంగ్లండ్పై టీమిండియా 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.