ఇంగ్లండ్తో రెండో టెస్టులో శుభ్మన్ గిల్(100*) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఓ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్ల్లో 100 పరుగులతో మొత్తం 369* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్(344) రికార్డును బద్దలు కొట్టారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 304/4.