అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించారు. ఇంగ్లండ్పై దూకుడుగా ఆడుతూ గిల్ 129 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. టెస్ట్ కెరీర్లో గిల్కు ఇది 8వ శతకం. దీంతో 67 ఓవర్లకు భారత్ స్కోరు 304/5గా ఉంది. క్రీజులో గిల్ (100), రవీంద్ర జడేజా (25) పరుగులతో ఉన్నారు.