అలహాబాద్లో విద్యను అభ్యసించి లా చదవడానికి ఇంగ్లండ్ వెళ్లారు. స్వదేశానికి తిరిగివచ్చిన తరవాత జాతీయోద్యమంలో ప్రవేశించి మహాత్మాగాంధీకి సన్నిహితులయ్యారు. భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొని నెహ్రూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. జైలులో ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలను నెహ్రూ రచించారు.