TG: SC, ST, BC మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి స్కూళ్లలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని CM రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు, డే స్కాలర్స్కూ ఆ స్కూళ్లలోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలన్నారు.