సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ దశ ఎన్నికలకు స్వరం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిలో యూపీలో 14, పశ్చిమ బెంగాల్లో 7, బిహార్లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, కశ్మీర్లో1, లద్ధాక్లో 1 స్థానం ఉన్నాయి. ఇక ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.