తెలంగాణ రాష్ట్రంలోని 1-9 తరగతుల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి 17 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి గురువారం విడుదల చేశారు. ఏప్రిల్ 23న పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించి ప్రొగ్రెస్ రిపోర్టును అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.