తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు పలు సంస్థలు ముందుకొచ్చాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. " పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ పరిశ్రమలు విస్తరించాల్సిన అవసరం ఉంది." అని అన్నారు.