భారత్-పాక్ మధ్య యుద్ధవాతావరణం తారాస్థాయికి చేరుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న చర్యతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ వాసి మాట్లాడుతూ.. ‘రాత్రి తినే సమయంలో కొన్ని పేలుళ్ల శబ్దం వినిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ పేలుడు శబ్దం వినిపించింది. గాల్లో డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయి. మన ఆర్మీ బాగా పని చేస్తోంది.’ అని అన్నారు.