తెలంగాణలో కౌలు రైతుల గురించి రేవంత్ సర్కార్ ఎందుకు స్పందించడం లేదు అని BRS మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. రైతుబంధు రాక ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని BRS తరఫున డిమాండ్ చేశారు.