TG: రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రైతుభరోసా డబ్బులు నాలుగు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కూడా సీఎం చర్చించినట్లు సమాచారం.