ఇండోనేషియా సుబాంగ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. బండంగ్లోని హిల్ రిసార్ట్ ప్రాంతం నుంచి విద్యార్థులు, టీచర్లతో కూడిన బస్సు డిపోక్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడంతో బస్సు రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 61 మంది ఉన్నారు. వారిలో 9 మంది సంఘటనా స్థలంలో, మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.