రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాజ్సమంద్ జిల్లా మజేరా గ్రామం సమీపంలోని హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు-ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడగా, వారిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెస్క్యూ టీంలు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.