గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. గురువారం ఉదయం పటాన్లోని సమీ-రాధన్ పూర్ హైవేపై ప్రవేట్ బస్సు వేగంగా వస్తూ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.