నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి, 50 పశువులు సజీవదహనం

59చూసినవారు
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి, 50 పశువులు సజీవదహనం
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలో బిడా-అగై-లపాయ్ హైవేపై ఆదివారం రోజున పెట్రోల్ ట్యాంకర్, పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించిందని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో 48 మంది అక్కడికక్కడే మరణించగా, 50 పశువులు సజీవదహనమైనట్లు తెలిపింది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్