తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పి వ్యాన్ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉలుందూర్ పేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. తిరుచెందూర్ సబ్రమణ్య స్వామి ఆలయం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.