యూపీలోని సుల్తాన్పూర్-పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కార్పియో కారు ప్రమాదవశాత్తు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ జంట ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.