భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జమ్మూలో విధుల్లో ఉన్న తన తండ్రి కోసం ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నాన్న రాత్రి చివరిసారిగా ఫోన్ చేసి శుభరాత్రి చెప్పారు. ఆందోళన చెందొద్దని, నిద్రపోమని చెప్పారు. భారత సైన్యం ప్రతిదీ కంట్రోల్లో ఉంచిందని నమ్మకం ఇచ్చారు’’ అని సమయ్ తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు.