గుజరాత్లోని రాజ్కోట్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకునే తండ్రి కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాంకుభాయ్ బోరిచా (76) తన కుమారుడు ప్రతాప్ బోరిచా(52)ను రెండో పెళ్లి చేసుకోమన్నాడు. అయితే ప్రతాప్ దానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తగ కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకీ తీసుకొని కొడుకును కాల్చి చంపేశాడు. కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు రాంకుభాయ్ను అరెస్ట్ చేశారు.