ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ఫామ్పై ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ ఆపాస్మారక స్థితిలో కింద పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గమనించి ఇతర సిబ్బందితో కలిసి సదరు మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.