పాకిస్తాన్ ఫిరోజ్పూర్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో సామాన్య ప్రజలు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్కు భారత్ భద్రతా దళాలు గట్టిగా బుద్ధి చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.