TG: సివిల్స్ మెయిన్స్ అర్హులైన ప్రతీ అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకుని తెలంగాణకు పనిచేయాలని కోరకుంటున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసి మాట్లాడారు. 'అభ్యర్థులు టాప్ ర్యాంకులో వచ్చి తెలంగాణకు పనిచేస్తే బాగుంటుంది. వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సివిల్స్కు వెళ్తున్నారు. సివిల్స్ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే ఆర్థిక సాయం అందిస్తున్నాం' అని అన్నారు.