హర్యానాలో అగ్ని ప్రమాదం సంభవించింది. గురుగ్రామ్లో సెక్టార్-29లోని ఓ భవనంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 30కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనంలోని ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.