TG: తెలుగు రాష్ట్రాలలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. వెంకార్ రసాయన పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగ అలుముకోవడంతో జనం పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.