సరిహద్దుల్లో పాక్ జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళీ నాయక్, పూంచ్ సెక్టార్లో పాక్తో జరిగిన పోరాటంలో దినేష్ కుమార్ శర్మ ప్రాణాలు కోల్పోయారు. మురళీ పార్థివదేహం శనివారం స్వగ్రామం రానుంది. దినేష్ కుమార్ శర్మ భౌతికకాయాన్ని పాల్వాల్లోని అతని స్వస్థలానికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.