మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాకు చెందిన అదిబా ఆనం తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాలలో 142వ ర్యాంక్ సాధించి, ఆ రాష్ట్రం నుంచి IAS అయిన తొలి ముస్లిం యువతిగా గుర్తింపు పొందారు. ఆటో డ్రైవర్ కూతురైన అదిబా.. టెన్త్లో 98%, ఇంటర్లో 97% మార్కులతో మెరిశారు. గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్కు సిద్ధమయ్యారు. మూడో ప్రయత్నంలో విజయం సాధించిన అదిబా.. 12వ తరగతి నుంచే IAS కావాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు తెలిపారు.