తొలిసారి పంది కిడ్నీని మార్పిడి జరిగిన, మెకానికల్ గుండె కలిగిని న్యూజెర్సీకి చెందిన 54 ఏళ్ల మహిళ మరణించింది. ఏప్రిల్ నెలలో ఈ రెండింటిని విజయవంతంగా చేయించుకున్న లిసా పిసానో, మొదటగా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లు కనిపించింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం మరణించినట్లు సర్జన్ ప్రకటించారు. న్యూజెర్సీకి చెందిన పిసానో, న్యూ యార్క్లోని ఒక ఆసుపత్రిలో జన్యుపరంగా సవరించిన పంది కిడ్నీ, హార్ట్ పంప్ను అమర్చుకున్నారు.