మహారాష్ట్రలోని పూణేలో వెలుగుచూసి.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఏపీలోని ఏలూరు జిల్లాను తాకింది. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఐదేళ్ల బాలికకు ఈ లక్షణాలు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 15 రోజులుగా ఆమెకు కండరాలు పట్టేయడంతో కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులను సంప్రదించారు. బాలిక వెన్ను నుంచి నీరు తీసి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ పరీక్ష చేయగా జీబీఎస్ లక్షణాలుగా నిర్ధారణ అయింది.