భారత్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోతుంది. గురువారం లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలు పాక్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పేలుళ్లు పాక్ ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలోనే చోటుచేసుకోగా, అక్కడ 5 నుంచి 6 అడుగుల డ్రోన్ శకలాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కరాచీ ప్రాంతాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.