‘మిత్ర మండలి’ మూవీ టీజర్ కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూవీలో హీరోయిన్ నిహారికను ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నానని తెలిపారు. నిహారిక అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుంటానని పేర్కొన్నారు. తన సొంత ఐడితో వచ్చి ఏం చేసినా బూతులతో రెచ్చిపోతారు కాబట్టి ఇలా వేరే అకౌంట్స్తో అందరిని అబ్జర్వ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.