శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థులకు అస్వస్థత

55చూసినవారు
శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్‌లో మాధాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 100 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో హుటాహుటీన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రీట్‌మెంట్ ఎలా ఇప్పిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు. వర్షాల నేపథ్యంలో పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్